Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
రాష్ట్రంలో దీర్ఘకాలంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్న జర్నలిస్టులను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం సరికాదనీ, జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సోమ వారం కుషాయిగూడలోని ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాయకులతో జిల్లాలో జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై తాము ఏడేండ్లుగా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అనేక మంది జర్నలిస్టులు కరోనాతో చనిపోగా కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన జర్నలిస్టు లకు అద్భుతమైన కాలనీలు కట్టిస్తానని పదే పదే చెప్పిన సీఎం నేటికి ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదన్నారు. కరోనాతో చనిపోయిన అనేక జర్నలిస్టు కుటుంబాలు రోడ్డున పడ్డాయనీ, ఏ ఒక్క జర్నలిస్టు కుటుంబానికి సాయం చేయలేదని తెలిపారు. జర్నలిస్టులకు న్యాయం చేసే వరకు ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ కౌన్సిల్ సభ్యులు మెరుగు చంద్రమోహన్, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తన్నీరు శ్రీనివాస్, యావపురం రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు బలిదే అశోక్గుప్తా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, నాయకులు డి.కిరణ్ కుమార్ రావు, మెరుగు విష్ణుమోహన్ పాల్గొన్నారు.