Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
కుటుంబ తగాదాల నేపథ్యంలో.. భర్త బతికుంటే తనను రోజూ కొట్టడం, వేధించడం చేస్తాడని భావించిన భార్య తన భర్తను చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ జరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం బూసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన, బూసిరెడ్డి మురళీధర్రెడ్డి, మౌనిక దంపతులు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ సరూర్ నగర్లోని సాయి క్రిష్ణానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కొడుకు (మైనర్) ఉన్నారు. మురళీధర్ రెడ్డి హైటెక్ సిటీలోని ఒక హార్డ్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మౌనిక కూడా ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. నవంబర్ 6వ తేదీన మౌనిక బీఏ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేందుకు గుంటూరులోని గురజాలకు వెళ్లి సాయంత్రం వచ్చింది. ఆ తర్వాత ' ఆమె కొడుకు తల్లితో అమ్మా నువు ఎగ్జామ్ రాయడానికి వెళ్లాక.. నాన్న నీ గురించి అందరికీ తప్పుగా చెప్పాడు' చెప్పాడు. దీంతో భార్యాభర్తలు మురళీధర్రెడ్డి, మౌనికల మధ్య గొడవ ప్రారంభమై పెద్దదయింది. అదీగాక భర్త తనను రోజూ కొట్టడం, బాధ పెట్టడం చేస్తుంటాడని భావించిన మౌనిక కోపంతో ఇంట్లో ఉన్న చాకు తీసుకొని పొడిచింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగి పోయింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.