Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
యాదాద్రి ఆలయ బంగారు గోపురానికి సీఎం కేసీఆర్ కోరిక మేరకు మేడ్చల్ నియోజక వర్గం నుంచి కార్మికశాఖ మంత్రి చామకూర మాల్లారెడ్డి రూ. 3 కోట్ల 16 లక్షల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యలయంలో మంత్రితోపాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజాశేఖర్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లి పావనీ జంగయ్య యాదవ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, పోచారం చైర్మెన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ పలుగుల మాదవ్రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్గౌడ్, ఎమ్మేల్యే క్యాంపు కార్యలయంలో పూజలు నిర్వహించి, అనంతరం యాదాద్రి లకిëనర్సింహ్మా స్వామి ఆలయానికి విరాళం అందజేశారు.