Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడి దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి అధ్యక్షుడు లాస్మ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ కోసం ఆస్తులు అమ్ముకొని, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నా ఉద్యమకారులు ప్రస్తుతం తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడిచినా ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఉద్యమించిన వారిని స్వతంత్ర సమర యోధులుగా గుర్తించి పెన్షన్లు, హెల్త్ కార్డులు, 200 గజాలలో ఇండ్లు, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో అవకాశం, ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్ట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి స్వామి, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవీందర్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు.