Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఒత్తిడిలేని విద్యా విధానంతోనే నీట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించామని అపోలో మెడికల్ అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సోమవారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించిన తొలి ఏడాదిలోనే తెలుగు రాష్ట్రాల విద్యార్థులలో చెరగని ముద్ర వేసిందని అన్నారు. అకాడమీలోని ప్రతి ఇద్దరు విద్యార్థిలో ఒక్కరు ఎంబీబీఎస్ ఏ కేటగిరిలో సీటు దక్కించుకున్నారని చెప్పారు. ఒత్తిడి లేని విద్యావిధానాలతో అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందంతో ఈసక్సెస్ సాధించినట్లు పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరం ప్రతి ఒక్క విద్యార్థికి ఆలిండియా ర్యాంక్స్ సాధించేలా కృషి చేస్తామని డైరెక్టర్స్ తెలిపారు.