Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఎలైట్ వరల్డ్ రికార్డు సంస్థతో తమ అసోసియేషన్ సైకాలజిస్టులకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోతుకూరి రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల ద్వారా తమ అసోసియేషన్ సైకాలజిస్టులు తెలంగాణలోని విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించామన్నారు. మానసిక ఆరోగ్యంపై 24 గంటల వెబినార్ మారథాన్ ఈ నెల 28న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈఅవగాహన కార్యక్రమాల్లో భాగంగా తమ అసోసియేషన్ సైకాలజిస్టులను ఎలైట్ ప్రపంచ రికార్డులో పేర్లు నమోదు చేయించామని తెలిపారు. ఇందుకుగాను వారికి వరల్డ్ రికార్డు ధ్రువీకరణ పత్రం, మెమొంటోలు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జినాల్ జోషి, డాక్టర్ ధనశ్రీ నాయుడు, చిరంజీవి, రహమత్ సుల్తానా, శ్వేత, రాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.