Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు రెండో వార్డు రసూల్ పురకు చెందిన బాధితురాలు శంకర మ్మకు ఎమ్మెల్యే సాయన్న స్వయానా ఇంటికి వెళ్లి మంగళవారం బాధితురాలికి చెక్కును అందజేశారు. కిడ్నీల సమస్యతో నిమ్స్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స కోసం రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో వారు ఎమ్మెల్యే సాయన్న దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్, మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, పాల్గొన్నారు.