Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ వికాస్ మంచ్ మంగళవారం సభ్యత్వ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. బోయిన్పల్లి ప్రే గ్రౌండ్లో రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు పాల్గొని అట్టహాసంగా సభ్యత్వం తీసుకున్నారు. దాదాపు 4 లక్షల పైచిలుకు ప్రజలను కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాన్ని జీహెచ్ ఎంసీలో విలీన దక్పథంతో ప్రారంభమైన మంచ్ కంటోన్మెంట్ 8 వార్డులలో సభ్యులను చేర్చుకునేందుకు గాను కంటోన్మెంట్ వికాస్ మంచి ఎనిమిది వార్డులలో సభ్యత్వం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విలీనం వల్ల జరిగే లాభాలు స్థానికులకు వివరిస్తుండంతోపాటు అందరిని ఏకం చేయడమే లక్ష్యంగా సభ్యత్వ కార్యక్రమం చేపట్టారు. ఒకటో వార్డులో ప్రారంభమై కంటోన్మెంట్ వ్యాప్తంగా 8 వార్డుల బస్తీ, కాలనీలు, సంక్షేమ సంఘాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని వార్డుల్లో జరు గుతుందని ఈ సందర్భంగా మంచి ప్రతినిధులు వివరించారు. గడ్డం ఏబుల్, సంకి రవీందర్, ప్రభుగుప్తా, ముప్పిడి మధుకర్, జ్ఞాన ప్రకాష్, ఎస్డి అమీర్, శ్రీరాములు యాదవ్, శశి పరికీ మహేందర్, రామారావు, వరద రాణి, మహమ్మద్ పసి, నరేష్, నర్సింగ్ రావు, మురళికృష్ణ, విశ్వనాథ్, నరహరి, శ్రీనివాస రావు సభ్యత్వం నమోదు చేసుకుని పుస్తకాలను స్వీకరించారు.