Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
పేదలను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని సీపీఐ(ఎం) నగర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ పరిధిలోని పేరలు గార్డెన్లో అంబర్పేట జోన్ మహాసభ జరిగింది. ఈసమావేశానికి నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని, దేశ సంపద మొత్తం బడా కార్పొరేట్ సంస్థలకు దోచి పెడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై రూ.55 పెంచి ఐదు రూపాయలు తగ్గించి పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకుంటున్నదని విమర్శించారు. గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. రాష్ట్రంలోని అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఆరేండ్లు గడుస్తున్న కార్యరూపంలోకి రాలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం 9 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జోన్ కన్వీనర్గా మహేందర్, సభ్యులుగా డీఎల్ మోహన్, అఖిల్, శేషయ్య, షబానా బేగం, సుబ్బారావు, సోమయ్య, ధనరాజ్, రయీసు, జబ్బార్, ఏసు, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.