Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
కరోనా కష్టకాలంలో డిగ్నిటీడ్రైవ్ ప్రతినిధులు అందించిన సేవలు అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఫౌండర్ రెనీగ్రేస్ జయకుమార్కు హీరో సోనుసూద్తో కలిసి అవార్డు ప్రదానం చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా డిగ్నిటీడ్రైవ్ సభ్యులు 250 మందిని ఆదుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్లాస్మా, బెడ్ అలాట్మెంట్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఆక్సిజన్ అందజేత వంటి వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ అభాగ్యులకు అండగా నిలిచారని గుర్తు చేశారు.