Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
తిరుపతిలో ఈనెల 13న జరుగనున్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బీసీ జనగణన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం విద్యా నగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీమకు వెళ్లి నీళ్లు, ఉద్యమ ద్రోహులకు అవకాశం ఇచ్చే అంశంలో నిస్సిగ్గుగా ఉద్యమ ఆకాంక్షలకు, మూలాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఖరిపై చర్చ జరగాలని పిలుపునిచ్చారు. బీసీ జనగణ అంశంపై ముఖ్యమంత్రుల ఏకాభిప్రాయం ఉన్నందున అనుకూల తీర్మానానికి కేంద్రంపై ఒత్తిడికి ఇది మంచి అవకాశమనే నేపథ్యాన్ని గుర్తు చేశారు. బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖకు, రాజకీయ రిజర్వేషన్ తీర్మానాన్ని కూడా అనుకూల సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో సుధాకర్ ముదిరాజ్, మధు, చంటి ముదిరాజ్, పగిల్ల సతీష్, బ్రహ్మ్మయ్య తదితరులు పాల్గొన్నారు.