Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రౌడీషీటర్తోపాటు గంజాయి స్మగ్లర్పై హైదరాబాద్ కమిషనరేట్లో పీడీ యాక్టు నమోదు చేశారు. మంగళవారం సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పురానాపూల్కు చెందిన రౌడీషీటర్ ఠాకూర్ దీపక్ సింగ్పై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లొచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కామాటీపురా పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కేసు నమోదు చేశారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ప్రవర్తనలో మార్పురాకపోవడంతో పీడీ యాక్టు నమోదు చేశారు. చాంద్రాయణ గుట్టకు చెందిన డ్రగ్స్ స్మగ్లర్ ఎండీ ముజీబ్ పై పీడీయాక్ట్ నమోదయింది. జులాయిగా తిరుగుతూ.. గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా చేస్తుండటంతో ఏప్రిల్ 30న అతనిని ఫలక్నుమా పోలీసులు రిమాండ్కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు తిరిగి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు. దాంతో అక్టోబర్ 29న మరోసారి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడిలో మార్పురాకపోవడంతో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.