Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని చివరి బస్టాప్లో బీజేపీ ఓబీసీ మెర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కె.శేఖర్యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ ఉత్సవాలకు మాజీ మంత్రి సినీ నటుడు బాబు మోహన్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, బీజేపీ నాయకురాలు తుల ఉమా, ఓబీసీ మెర్చా రాష్ట్ర అధ్యక్షులు అలే భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నందనం దివాకర్, మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్సింహారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదర్ ఉత్సవాలు ప్రతిఏటా ఘనంగా జరుపుతున్నారన్నారు. సదర్ ఉత్సవాలను కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేష్యాదవ్, మోటే శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.