Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ నాయకులు డిమాండ్్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండవరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఓయూ కార్యదర్శి క్రాంతిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు హాస్టళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని, కిన్నెర లాంటి హాస్టళ్లలో పెచ్చులూడిపోతున్నాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలలో అనేకమంది ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేషన్ పదవుల్లో ఉండి, తరగతుల్లో పాఠాలు చెప్పడం లేదని వీసీ ఈ సమస్యపై దష్టి సారించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లోఉన్న 3,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రెహమాన్, జగన్, సంతోష్, రాజు, సాయి పాల్గొన్నారు.