Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
రంగారెడ్డినగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ బి.విజరుశేఖర్గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలొని సంజరుగాంధీనగర్లో భూగర్భ డ్రయినేజీ అభివృద్ధి పనులను, మారుతినగర్లో నూతన తాగునీటి పైపులైన్ వేయుట, గాంధీనగర్ బస్టాప్లో తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం ఎపిహెచ్బికాలనీలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వాముల నిత్య అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ పూజ, డివిజన్ యుత్ అధ్యక్షులు అంజి ముదిరాజ్, నాయకులు కార్తీక్గౌడ్, శ్రీనివాస్, సుమన్ అనంద్, ఎర్వ సాయికిరణ్, రాజవర్ధన్రెడ్డి, జయరావ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు , కాలనీ వాసులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.