Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గిరిజన సమాజం తరుపున ఉద్యమ కారుడు, క్రీడాకారుడు, డాక్టర్ కరాటే రాజు నాయక్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని గిరిజన విద్యార్థులు, నాయకులు కోరారు. ఈమేరకు బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ అవకాశాలు రాక మిగిలి ఉన్నది కేవలం గిరిజన సామాజిక వర్గం మాత్రమే అని అన్నారు. గిరిజన విద్యార్థి ఉద్యమ నాయకుడు డా. కరాటే రాజు నాయక్కు సముచిత స్థానం కల్పిస్తూ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని గిరిజన సమాజం కోరుతుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు నాయక్, వైఎస్ఆర్ టీపీ రాష్ట్ర కన్వీనర్ విజరు నాయక్, పారా మెడికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాథోడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, పరిశోధక విద్యార్థి సైదులు నాయక్ వివిధ సంఘాల నాయకులు మరియు అనేక విద్యార్థులు పాల్గొన్నారు.