Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్ యాదవ్ బుధవారం సాయంత్రం నూతనంగా పలు అకాడమిక్ పదవులను నియమించారు. ఓయూ పీఆర్ఓగా జువాలజీ సీనియర్ ప్రొఫెసర్ డా.సి.శ్రీనివాసులు, ఓయూ దూరవిద్య జాయింట్ డెరైక్టర్ ఓయూ ఈఎస్ఈ డా.వి.బి.నరసింహ, ఓయూ సైన్సు కళాశాల ప్రిన్సిపాల్గా జియో ఫిజిక్స్ ప్రొపెసర్ బి.వీరయ్య, సివిల్ సర్వీసెస్ అకాడమిక్ డెరైక్టర్ సోషియాలజీ ఫ్రొపెసర్ ప్రొ.చింతా గణేష్, జాయింట్ డెరైక్టర్గా బొటాని విభాగ సీనియర్ ప్రొ. డా.ఈ. సుజాత, ఓయూ యూజీసీ హెచ్ఆర్డీసీ డైరెక్టర్గా ఆంగ్లభాష అధ్యాపకురాలు డా.బి.విజయ, అసిస్టెంట్ డైరెక్టర్గా డా.వి.సమున్నత, అసోసిసెట్ డైరెక్టర్గా హిస్టరీ విభాగ సీనియర్ అధ్యాపకురాలు డా.బి.లావణ్య, లేడీస్ హాస్టల్ డైరెక్టర్గా జువాలజీ అధ్యాపకురాలు డా.జి. సునీత దేవి ని నియమించారు. వీరికి వీసీ ప్రొ.రవీందర్ యాదవ్ ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. పప్పుల.లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ ప్రొ. రెడ్యా నాయక్ పాల్గొన్నారు.