Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏటా తెలుగులోని వివిధ సాహితీ ప్రక్రియలకు నగదు పురస్కారాలు అందజేస్తోంది. ఇందులో భాగంగా తెలుగులో వివిధ సాహితీ ప్రక్రియలల్లో పురస్కారాల ఎంపికకు సూచనలను వివిధ వర్గాల నుంచి సూచనలు కోరుతోంది. రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ తమ ప్రకటనలో 2016 జనవరి నించి 2018 డిసెంబర్ వరకు వెలువడిన వచన కవిత, పద్య కవిత,బాల సాహిత్యం, నవల, కదానికల సంపుటి, నాటిక/ నాటక సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం ఈ పది ప్రక్రియల్లో తమకు నచ్చిన ఒకటి గాని, అన్ని ప్రక్రియలను గాను సూచనలు పంపవచ్చు.తొలి సరిగా ప్రచురించినవి, అనువాద సాహిత్యం కాకుండా ఇతర ప్రక్రియల్లో అనువాదాలు, అనుసరణలు కాకుండా ఉండాలి. సూచనలో రచయిత పెరు, గ్రంధం పేరు,రచయిత చిరునామా, పేజీ ల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ కర్త పేరు సూచనలో పేర్కొనాలి. రచయితలు తామూ స్వయంగా పంపవచ్చు. వచన రచన ప్రక్రియలో సామాజిక, ఆర్థిక తాత్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర దేశ చరిత్ర, కళలు, సంస్కతి సంబంధించిన అంశాలు ఉండవచ్చు. రచయిత మరణించినప్పటికీ వారి రచనలు సూచించవచ్చు. తెల్ల కాగితంపై పై వివరాలను పొందుపరచి, రిజిస్టర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,హైద్రాబాద్ 500004 చిరునామాకు 30 నవంబర్ 2021 లోగా పంపాలి. వివరాలకు 9949372284లో సంప్రదించవచ్చు అని సూచించారు.