Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
కార్తీక మాసం పురస్కరించుకొని ఈనెల 12 తేదీ నుంచి 22 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవ్ నిర్వహించనున్నారు. 11 రోజుల ప్పాటు జరిగే ఈ కార్యక్రమంలో పలు క్షేత్రాల దేవత మూర్తులకు కల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. భక్తులే ప్రతిరోజు దీపారాధన చేసుకునే వీలుగా సామగ్రిని నిర్వాహకులు అందజేస్తారు. ప్రారంభోత్సవంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ జీ, స్వామి స్వరూపానంద, చిన్న జీయర్, ఉడిపి పెజావార్ విశ్వ ప్రసన్న తీర్ద్, గణపతి సచ్చిదానంద స్వామి, ఆధ్యాత్మిక ప్రసంగకులు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహ రావు, సామవేదం షణ్ముఖ శర్మ, తదితర ప్రముఖులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు