Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలొని మగ్దూంనగర్, రింగ్బస్తీలలో బిహార్ వాసులు నిర్వహించిన ఛట్ పూజ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛట్ పూజలు ఐక్యమత్యంతో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ రశీద్, హనుమయ్య, సంతోష్, వెంకటరమణ, అరుణ్కుమార్, సంతోష్ పటేల్, అఖిలేష్, యూపి, బిహార్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.