Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి పరిశోధకుల (లైఫ్ టైం అఛీవర్స్) జాబితాలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ (ఎల్వీపీఈఐ)లోని ప్రముఖ శాస్త్రవేత్తలు ఆరుగురు పేర్కొనబడ్డారు. డా గుళ్ళపల్లి ఎన్ రావ్, స్థాపకులు డిస్టింగ్విష్డ్ చైర్ ఆఫ్ ఐ హెల్త్, పొఫెసర్ దొరైరాజన్ బాలసుబ్రమణియన్, డైరెక్టర్ ఎమిరిటస్, ప్రొఫెసర్ బ్రియన్ హౌల్డెన్ ఐ రిసర్చ్, డా సావిత్రి శర్మ, డైరెక్టర్ ఎమిరిటస్, లాబొరేటరీ సర్వీసెస్, ప్రొఫెసర్ జిల్ కీఫ్, విజిటింగ్ ప్రొఫెసర్ డా ప్రశాంత్ గర్గ్, ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్. ఎల్పీపీఈఐ ఫాకల్టీ పూర్వ సభ్యులు, డా వీరేందర్ సంగ్వాన్, డా సంతోష్ హౌనావర్, డా జరు ఛబ్లానీ, డా రవి థామస్, డా ఉందుర్తి ఎన్ దాస్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
డా గుళ్ళపల్లి ఎన్ రావ్, ప్రొఫెసర్ దొరైరాజన్ బాలసుబ్రమణియన్, డా సావిత్రి శర్మ, ప్రొఫెసర్ జిల్ కీఫ్, డా శివాజీ సిసింతి గతేడాది స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొదటిసారి ప్రచురించిన ఇటువంటి అధ్యయనంలో అగ్రశ్రేణి 2% ప్రపంచ శాస్త్రవేత్తలుగా శ్రేణికరించబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి నేత్ర పరిశోధకులుగా ఎల్వీపీఈఐ శాస్త్రవేత్తలను చూడటం ఎంతో సంతోషదాయకంగా ఉందన్నారు.