Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ యూనివర్సిటీ ఫారెన్ రిలేషన్ ఆఫీస్ కార్యాలయానికి సంబంధించిన వెబ్సైట్లో ఉన్న కొన్ని తప్పిదాలు సవరించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 'ఎబౌట్ అజ్' లో నేటికి ఓయూ వీసీ మాజీ ఇన్చార్జ్ వీసీ అర్వింద్ కుమార్, మాజీ రిజిస్ట్రార్ ప్రొ.గోపాల్ రెడ్డి ఫొటోలు, పేర్లు ఉండటం గమనార్హం. కొత్తగా ఓయూ వీసీ, రిజిస్ట్రార్లు వచ్చి ఏడేండ్ల గడుస్తున్నా వారి ఫొటోలు నేటికి అప్డేట్ చేయకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఫారేన్ విద్యార్థులు నిత్యం వీక్షించే ఈ వెబ్సైట్లో నూతన వీసీ, రిజిస్ట్రార్ల ఫొటోలు పొందుపరచాలని విద్యార్థులు, ఉద్యోగులు కోరుతున్నారు. ఓయూలో సుమారు 75 దేశాలకు పైగా విద్యార్థులు యూజీ, పీజీ, పీహెచ్డీ ఇతర కోర్సులు అభ్యసిస్తున్నారు.