Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
కూన శ్రీశైలంగౌడ్
వివేకానంద నగర్లో పర్యటన
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలంగౌడ్ అన్నారు. చింతల్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్లో నెలకొన్న డ్రయినేజీ సమస్యలపై పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గత కొంత కాలంగా మురుగునీరు రోడ్లపై పారుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించిన శ్రీశైలం గౌడ్ జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో మాట్లాడి కాలనీలో నెలకొన్న డ్రయినేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. డ్రయినేజీ లైన్ల కోసం గత కొంత కాలంగా రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి వదిలేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోడ్లపై మురుగునీరు పారుతున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. బస్తీలో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.