Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ ఎక్స్ రోడ్లో రోడ్డుపై ప్లాస్టిక్ తగులబెడుతున్న వ్యక్తికి వెయ్యి రూపాయల జరిమానా విధించామని మల్కాజిగిరి సర్కిల్ శానిటరీ సూపర్ వైజర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరెడ్ మెట్ ఎక్స్ రోడ్డులో మధ్యప్రదేశ్ కి చెందిన భీమా సింగ్ రోడ్డుపైనే ప్లాస్టిక్ తగులబెట్టాడు. డీసీ జి రాజు ఆదేశాల మేరకు అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేరెడ్మెట్ డివిజన్ జవాన్ షేక్ అహ్మద్, వినాయక్ నగర్ డివిజన్ జవాన్ శ్రీకాంత్, :ఇనిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గోవిందమ్మ పాల్గొన్నారు.