Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీమా సంస్థల నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ సేవలను వినియోగించుకోవాలని అంబుడ్స్మెన్ ప్రధాన అధికారి ఎన్ శంకరన్ పాలసీదారులను కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీమా లోపాలు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శంకరన్ మాట్లాడుతూ బీమా సంస్థలు పాలసీదారుడుకి రావాల్సిన మొత్తాన్ని చెల్లించడంలో సమస్యలు సృష్టించడం, ఇతర సమస్యలను పరిష్కరించే వేదిక ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని అన్నారు. 2020-21లో దేశమంతటా 35,019 ఫిర్యాదులు రాగా అందులో 30, 596 పరిష్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్ కార్యాలయానికి ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1393 ఫిర్యాదులు అందాయని వాటిలో 1306 ఇప్పటికే పరిష్కరించినట్లు చెప్పారు. పాలసీలు జారీ చేస్తున్న సమయంలో పాలసీలను విక్రయిస్తున్న సంస్థలు కాలపరిమితి పూర్తి అయిన అనంతరం చెల్లింపుల్లో, ఆరోగ్య బీమా చెల్లింపుల్లో చాలా సమస్యలు సృష్టిస్తున్నట్లు తమకు అందుతున్న ఫిర్యాదుల ద్వారా తెలుస్తుందన్నారు. బీమా సంస్థల నుంచి సమస్యలకు గురవుతున్న వారు నేరుగా తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చునని, లేనిపక్షంలో ఆన్లైన్ ద్వారా షషష.షఱశీఱఅర.షశీ.ఱఅ, bఱఎaశ్రీశీసజూaశ్రీ.ష్ట్రyసవతీabaసఏషఱశీఱఅ.షశీ.ఱఅ ఫిర్యాదు చేయవచ్చునని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబుడ్స్మెన్ సంస్థ సెక్రటరీ నిర్మలా దేవి, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.