Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్నగర్ డివిజన్ సుభాష్నగర్లోని జీనియస్ స్కూల్పై గురువారం మేడ్చల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. తప్పుడు ధృవ పత్రాలను సమర్పించి ఈటీఆర్ పొందడంతో జీనియస్ స్కూల్ను అధికారులు సీజ్ చేశారు. వైఎస్సాఆర్సీపీ విద్యార్థి విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.విశ్వనాథ్చారి మాట్లాడుతూ 2017లొ జీనియస్ స్కూల్ యజమాన్యం తప్పుడు ధృవ పత్రాలను సమర్పించి విద్యాశాఖ అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. బిల్డింగ్ లేకుండా అనుమతులు పొందిన విషయమై గతంలో పలుమార్లు డీఈఓ విజయకుమారికి, ఎంఈఓ ఆంజనేయులుకు వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. ప్రస్తుత డీఈఓ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ ఆదేశాలతో విద్యాశాఖ అధికారులు పాఠశాలపై చర్యలు తీసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.