Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆర్సీయూఈఎస్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొ.కుమార్ను బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలిసి పుష్పగుచ్ఛం అందేశారు. కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి అర్బన్ సెంటర్ను అభివద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని కోరారు. సెంటర్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ కొనసాగించాలని పెండింగులో ఉన్న వారి మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల సంజరు, ఓయు జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, అంబేద్కర్, అంజి తదితరులు పాల్గొన్నారు.