Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కుటుంబాన్ని ఆంధ్ర హీరోలు ఆదుకోవాలని, లేకురటే వారి సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు. గురువారం ప్రముఖ సినీనటుడు న్యాయవాది, జేఏసీ స్టీరింగ్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
సీవీఎల్ నరసింహారావు అధ్యక్షతన చిక్కడపల్లిలో స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పాటల రచయిత కందికొండ రెండేండ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు చేసుకుని నేడు కనీసం ఇంటి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఈనెల నుంచి ఆయన ఇంటి కిరాయి జేఏసీ చెల్లిస్తుందని ప్రకటించారు. కందికొండ రాసిన పాటల ద్వారా కోట్లు సంపాదించిన మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ ఇతర ప్రముఖ సినీ హీరోలు ఇంతవరకు ఆయన్ను పరామర్శించకపోవడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోలేదని విమర్శించారు. స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు నరసింహ మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా తెలంగాణ ఫిలిం ఇండిస్టీ ఆంధ్ర వారి చేతుల్లోనే ఉండటం దురదష్టకరమని, కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజు స్థానికేతరుడు అయితే ఆంధ్ర హీరోలు స్థానికులా? అని ప్రశ్నించారు. జేఏసీ గౌరవ అధ్యక్షులు సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కందికొండ కుటుంబాన్ని ఆదుకోకపోతే ఆంధ్రా హీరోల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ కోఆర్డినేటర్ మురళీధర్ దేశ్ పాండే, ఉపాధ్యక్షులు నల్ల రాధాకృష్ణ ,మాధురి గ్రాఫిక్స్ విభాగం కన్వీనర్ మోహన్ రాజ్, టీవీ విభాగం కన్వీనర్ ప్రేమ్, జి మీడియా విభాగం కన్వీనర్ బాలసుబ్రమణ్యం, లీగల్ విభాగం కన్వీనర్ శైలజ పాల్గొన్నారు.