Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తూటా (తెలంగాణ యూనివర్సిటీస్ ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్) రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొ.భీమానాయక్, ప్రధాన కార్యదర్శిగా ప్రొ.శ్రీను నాయక్, ఉపాధ్యక్షులుగా డా.నర్సింహ, డా.సుశీల, ట్రెజరర్గా డా. డా.కె.శ్రీనివాస్ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డా.బలరాం నాయక్, ప్రొ.చిన్న సైదులు, డా.రాజు, సభ్యులు డా.హనుమంతు, డా.హీరాలాల్, ప్రొ.శ్రీనివాస్, డా.వి.రాజు నాయక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా భీమా, శ్రీను నాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రజల ఉన్నత విద్యా, హక్కుల కోసం పాటుపడుతామన్నారు. వీరిని గురువారం గిరిజనశక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, ఇతర నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. రాబోయే రోజుల్లో తూటా గిరిజన విద్యార్థులతో ప్రజలకు ఉపయోగపడే సెమినార్లను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గిరిజన శక్తి నాయకులు రాజు నాయక్, మహేష్, విజరు నాయక్ పాల్గొన్నారు.