Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
దివ్యానగర్ను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని దివ్యానగర్ ప్లాట్, హౌస్ ఓనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, నల్ల మల్లారెడ్డి విద్యాసంస్థ అధినేత నల్ల మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామ పరిధిలోని దివ్యానగర్లో నల్ల మల్లారెడ్డి తన సొంత నిధులు దాదాపు రూ. 75లక్షలతో, 3లక్షల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ను నుంచి గురువారం స్థానిక సర్పంచ్ కొంతం వెంకట్ రెడ్డితో కలిసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యానగర్లో ఆరోగ్య కరమైన వాతావరణం నెలకొల్పబడిందని, కాలనీలో మొత్తం దాదాపు రూ. 2కోట్లకు పైగా తన సొంత నిధులతో కమ్యునిటి భవనం, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కు, రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా ఇంకుడు గుంత, వాటర్ ట్యాంక్ నిర్మించామన్నారు. కాలనీలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంక్తో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ చెట్టిపల్లి గీత, వార్డు సభ్యులు నల్ల అరుణ, నల్ల రజిత, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రేకుల రమణా రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.