Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవి శంకర్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
అసంఘటిత రంగ కార్మికులు ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు రవి శంకర్ అన్నారు. గురువారం గాంధీనగర్లో డీసీఎం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు వి.సమ్మయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ శిబిరం నిర్వహించారు. బీపీటీఎంఎం తెలంగాణ ప్రధాన కార్యదర్శి టి. యాదయ్య, కోశాధికారి .జి.బాబురాజ్, తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ.శంకర్, సీఎస్సీ సెంటర్ నిర్వాహకులు మణిరత్నం పాల్గొని డీసీఎం డ్రైవర్లకు, ఓనర్లకు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించారు. ఈ శ్రమ ఇన్స్రెన్స్ చేయించుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ఈసందర్భంగా నూతన కమిటీని ప్రకటించి అధ్యక్ష కార్యదర్శులు సమ్మయ్య యాదవ్, సాయిగౌడ్లకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం డీసీఎం డ్రైవర్లకు, ఓనర్స్కు యూనియన్, ఈశ్రమ్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో గాంధీనగర్ డీసీఎం ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు ఎండీ జాఫర్ ఖాన్, యాదగిరిగౌడ్, సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి ఈ.సాయిగౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, మల్లునాయక్, శేషుగౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్ఞానేశ్వర్, ఆఫిస్ సెక్రటరీ రమేష్, కోశాధికారి కె.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.