Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి. రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టాక పలు సంస్కరణలు చేపట్టుతున్న విషయం తెల్సిందే. పారదర్శకత, పెండింగ్ లేకుండా సకాలంలో పనులు,ఫైల్స్ పూర్తి చేయడంలో భాగంగా పాత, మూస పద్ధతికి స్వస్తి పలికేందుకు సన్నద్దమయ్యారు. దానిలో భాగంగా మారుతున్న టెక్నాలజీని జోడించి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లటానికి త్వరలోనే ఓయూలో 'ఈ-ఆఫీస్ను' తీసుకు రావటానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగానే పేపర్ రహిత పాలన కోసం ఈ ఆఫీస్ ను తీసుకువస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఓయూ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అధికారులైన ఏఆర్, జేఆర్, డీిఆర్ లకు సంబంధిత విభాగంలో నిపుణులు అయిన నిష్ణాతులైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారితో శిక్షణ ఇచ్చారు. ఇంకోవైపు ఇటీవలే కొందరు ఉద్యోగులకు కూడా నగరంలో నెల రోజుల పాటు శిక్షణ తరగతులు ఇప్పించారు. ఇక రానున్న రోజుల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ ఆఫీస్ను దశలవారీగా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.