Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఆర్ట్స్ కాలేజీ అకాడమిక్ రిసర్చ్ కమిటీ (ఏఆర్సీ) ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ ప్రొ. సి. గణేష్, ఏఆర్సీ కన్వీనర్ బి. లావణ్య అధ్యక్షతన 'వై లైబ్రరీస్ ఇన్ గూగుల్ ఇన్ ఎరా' అనే అంశంపై అకాడమిక్ టాక్ ఆన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. లైబ్రరీ సైన్స్ హెడ్ డా.కె. భారతి డిజిటల్ యుగంలో రీసెర్చ్ సంబంధించిన సమాచారాన్ని ఎలా పొందవచ్చో, వివిధ సెర్చ్ ఇంజన్స్, ఇన్ఫర్మేషన్ క్యాటలాగ్స్ గురించి వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డా. ఎ. అనుపమ, అకాడమిక్ ఆడిట్ జాయింట్ డైరెక్టర్ డా. ఎమ్. రాములు, హిస్టరీ హెడ్ ప్రొ. అర్జున్ రావు, డా. సీఎస్ స్వాతి, డా. పి స్వాతి, డా. వివేకవర్ధన్, వివిధ డిపార్టుమెంటు హెడ్స్, బీఓఎస్ ఛైర్ పర్సన్స్, టీచింగ్ స్టాఫ్, రిసర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.