Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
వైఎంసీఏ, వైడబ్ల్యుసీఏ గ్రేటర్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 'వరల్డ్ వీక్ ఆఫ్ ప్రేయర్-వరల్డ్ ఫెలోషిప్-2021' కార్యక్రమంలో భాగంగా కోవిడ్-19, బాల్య వివాహాలు, చైల్డ్ లేబర్, గర్ల్ చైల్డ్, మహిళలపై లైంగికదాడులు తదితర అంశాలపై ప్రజలు, యువత, విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం సంస్థ ప్రతినిధులు శుక్రవారం నెక్లెస్ రోడ్డు నుంచి లిబర్టీలోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహం మీదుగా నారాయణగూడ వైఎంసీఏ రాష్ట్ర కార్యాలయానికి 'సైలెంట్' ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ జోనాథన్ ధర్మరాజ్, ప్రధాన కార్యదర్శి ప్రీస్ట్లీ గయాస్ (మాసి చరణ్), మాజీ ప్రధాన కార్యదర్శి బి.జె.వినరు స్వరూప్, ఉపాధ్యక్షులు జీ.ఎం.దీన్ దయాళ్, ట్రెజరర్ పి.నరేంద్ర, వైడబ్ల్యూసిఏ అధ్యక్షులు మిసిస్ బ్లాలా ప్రిలిప్, ప్రధాన కార్యదర్శి రాణి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.