Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికలాంగుల హక్కుల పోరాట సమితి
జాతీయ ఉపాధ్యక్షులు అందే రాంబాబు
నవతెలంగాణ-ముషీరాబాద్
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకష్ణ మాదిగ పిలుపు మేరకు శనివారం రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లి, పాలమూరు బస్తీ కమ్యూనిటీ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) నియోజవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిóగా హాజరైన వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులు అందే రాంబాబు మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమ శాఖని స్వతంత్రతగా ఏర్పాటు చేసి, సహకార సంస్థను బలోపేతం చెయ్యాలని డిమాండ్ చేశారు. వికలాంగులు వద్ధులు వితంతువుల పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వన్ 2018 లాంగ్వేజ్ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. సహకార సంస్థల ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ నాయకుడు చెరుకు నాగభూషణం, హైదరాబాద్ కోఆర్డినేటర్ మునిరాత్ అరుణ్ కుమార్ మాదిగ, నియోజక వర్గం ఇన్చార్జి గండు వెంకటేష్ మాదిగ, సీనియర్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్ మాదిగ. గజ్జల రాజశేఖర్ మాదిగ, నాయకులు కుమారస్వామి మాదిగ, గంగాధర్ మహేష్ కుమార్ మాదిగ, గడ్డం శ్రీకాంత్ మాదిగ ఎం.రాములు మాదిగ, రామ్ పాక వెంకటేష్ మాదిగ, ది ఝాన్సీ, సుశీల, యాదన్న, శ్రీశైలమా. పాల్గొన్నారు.