Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలో తీసుకువచ్చిన వికలాంగుల హక్కుల చట్టంను రాష్ట్రంలో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం బర్కత్పురలోని బీజేపీ నగర కార్యాలయంలో వికలాంగుల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులు, వద్ధుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో వద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి వారిని ఆదుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వికలాంగులకు అందజేయాలని, అలాగే వికలాంగులకు స్వయం ఉపాధి కోసం పది లక్షలను అందజేయాలని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, బీజేపి ఓపీసీ మోర్చా అధ్యక్షుడు కేశబోయిన శ్రీధర్, యశ్వంత్, సూర్యప్రకాష్ సింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.