Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్మెట్
రక్తదానం చేసి మనిషి ప్రాణాలు కాపాడుదామని డాక్టర్ శోభారాణి (ఎన్ఎస్ఎస్-పీఓ, జేఎన్టీయుహెచ్) అన్నారు. శనివారం పెద్దఅంబర్పేట మున్సిపల్, తట్టిఅన్నారంలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కళాశాలలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్.శోభారాణి హాజరై మాట్లాడారు. రక్త దానం చేయడం వల్ల మనం ఇతరులకు ప్రాణం పోసినవారమవుతామని తెలిపారు. అన్న దానం ఆకలి తీరిస్తే, రక్త దానం ప్రాణం పోస్తుందన్నారు. అందుకే ఆరోగ్యవంతమైన యువత రక్తదానం చేయుటకు ముందుకు రావాలని కోరారు. వారిచ్చిన రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారిమి అవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్త దానంపై అవగాహన పెంచుకోవాలని, సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. సుమారుగా 140 మంది రక్త దానం చేయటకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మెన్ హదరు రెడ్డి, ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, బ్లడ్ డోనర్సు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.