Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
నేటి సమాజంలో ఎంతో మంది దిక్కుమొక్కలేని అనాథలు అర్థాకలితో అలమటిస్తున్నారని, అలాంటి వారిని మాన వతా హదయంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని 9వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్గౌడ్ అన్నారు. శనివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్గుల్ గ్రామంలోని మాత దేవోభవ అనాథ అశ్రమంలో కీ.శే నిమ్మల ఈశ్వరయ్యగౌడ్ 2వ వర్ధంతి సందర్భంగా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ మాత దేవోభవ అనాథ అశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి ఎంతో మంది అనాథలను చేరదీసి వారికి మానవతా వాద హదయంతో ఆశ్రయం కల్పించడంతో పాటు మానసిక వికలాంగులు వైద్య పరీక్షలు చేయించి పునర్జన్మ కల్పించడం హర్షనీయమని తెలిపారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని నమ్మి ఎంతో మందిని అనాథలను చేరదీస్తున్నారని, వారి సేవ ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ ఈశ్వరయ్యగౌడ్ భార్య నిమ్మల రమాదేవి, కుమారులు, కోడళ్ళు నిమ్మల సునీత, శ్రీకాంత్గౌడ్, రవికాంత్గౌడ్, ధరణి, రజనీకాంత్గౌడ్, లావణ్య, కూతుళ్లు, అల్లుళ్లు, ఉషారాణి, వెంకటేష్గౌడ్, మనుమండ్లు వర్షిత్, రోహిత్, ఈశ్విత్, లోకేష్,హేమంత్, మనుమరాండ్లు శ్రీనిత్య, సహస్ర, ఆకాంక్ష, ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టుగిరి, సిబ్బంది పాల్గొన్నారు.