Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిలో విశ్వసనీయత కలిగేలా అవసరమైన చర్యలు తీసుకో వాలనీ, ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మొదలుకుని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ వైద్యశాలలు మొదలుకుని జిల్లా ఆస్పత్రుల వరకు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వా స్పత్రులు అంటే వారిలో విశ్వసనీయతను కలిగించేలా కృషి చేయా లని సూచించారు. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల పట్ల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనీ, ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలనీ, ఆస్ప త్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రులు బాగుండాలనే కృతనిశ్చయంతో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేసి తగిన సలహాలు, సూచనలు ఇస్తేనే ప్రజల్లో ప్రభుత్వా స్పత్రులపై పూర్తి విశ్వసనీయత కలుగుతుందన్నారు. ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతోపాటు ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా అందు తున్నాయి? సిబ్బంది పని తీరుతో పాటు వసతులు ఎలా ఉన్నా యి? అనే తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పరిశుభ్రత ఎంతో ముఖ్యమనీ, ఈ విషయంలో ఆయా ఆస్పత్రుల అధికా రులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాబోయే రోజుల్లో తాను కూడా రాష్ట్రంలోని ఆయా ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తాననీ, వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, మందులతోపాటు ప్రజలకు అందుతున్న వైద్య సేవలు గురించి తెలుసుకుంటానని వివరించారు. ఆయా జిల్లాల ఆస్పత్రులకు ఆక్సిజన్ ప్లాంట్లను కేటాయించామనీ, ప్రస్తుతం వాటి పనితీరు ఎలా ఉంది? అనే విషయాలపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాస్పత్రులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు నిధుల కొరత ఏమాత్రం లేదనీ, ఈ విషయంలో ప్రజలకు అన్ని రకాలుగా మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని తెలిపారు. ఆయా ఆస్పత్రుల్లో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలనీ, ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కరించేందుకు తాము స్వయంగా కృషి చేస్తానని తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం, నాన్ జీహెచ్ఎంసీ పరిధిలో 107 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. వ్యాక్సినేషన్ పూర్తికాని చోటా అందరికీ వ్యాక్సిన్ అందేలా కృషి చేస్తున్నామని మంత్రికి వివ రించారు. ఈ విషయమై మంత్రి హరీష్రావు స్పందిస్తూ జీహెచ్ ఎంసీ వారితో జిల్లా వైద్యశాఖ అధికారులు సమన్వయం చేసుకుని పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి కలెక్టర్ హరీష్ స్పందిస్తూ మంత్రి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో టీకాలు వేసేలా చర్యలు తీసుకుం టామని మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో డీఎంఅండ్హెచ్వో డాక్టర్ మల్లికార్జున్రావు, డీపీఓ రమణమూర్తి, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.