Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సాయన్న శనివారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ను కలిశారు. సికింద్రాబాద్ కంటో న్మెంట్ బోర్డు ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల గురించి సాయన్న కేటీఆర్తో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత 20 వేల లీటర్ల మంచి నీటి పథకాన్ని కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా అమలు చేయాలని కోరారు. ప్యాట్నీ కంపౌండ్ నాలా సమస్య, సిల్వర్ కంపెనీ డబుల్ బెడ్ రూంలో సమస్యను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించాలని సాయన్నకు సూచించారు. ప్యాట్నీ నాలా కోసం రూ.10 కోట్లు వెంటనే టెండర్లు సిద్ధం చేయించాలని మహేందర్రెడ్డిని ఆదేశిం చారనీ, సిల్వర్ కంపౌండ్లో మిగిలిన డబుల్ బెడ్ రూంల నిర్మాణంలో జాప్యం చేయకుండా ప్రియారిటీ బేసిస్లో నిధులు విడుదల చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మారేడ్పల్లిలో నిర్మించిన 470 డబుల్ బెడ్ రూం ఇండ్లను డిసెంబర్ 15 తర్వాత ప్రారంభిస్తారనీ, బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం గురించి ముఖ్య మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతానని కేటీఆర్ హామీని చ్చారని ఎమ్మెల్యే సాయన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.