Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్పేట డివిజన్లో గల కండోజి బజార్లో మాజీ కార్పొరేటర్ అత్తి లి అరుణ శ్రీనివాస్ గౌడ్, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మంత్రి దృష్టికి తీసుకు రాగా, ఆయా సమస్యలపై సంబంధిత అధికా రులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కాలనీలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరగా, అవసరమైన ప్రతిపా దనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సివరేజ్, వాటర్ లైన్ పనులు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్టు మంత్రి చెప్పారు. మ్యాన్ హొల్స్లలో తొలగించిన పూడికను తరలించకుండా అలాగే ఉంచుతున్నారని తెలపగా, వెంట తొలగించాలని ఆదేశించారు. ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కాలనీలో ఉన్న అన్ని సమస్యలను పరిష్క రించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. మంత్రి వెంట జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, డీఈ ప్రశాంతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, వాటర్ వర్క్స్ డీజీఎం శశాంక్, ఎలెక్ట్రికల్ ఏఈ భరత్ కుమార్, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు విశ్వేశ్వరరావు, శ్రీలత, జ్ఞానేశ్వర్, సతీష్, శివ, దుర్గాదాస్, ఆంజనేయులు, తదితరులు ఉన్నారు.