Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని శ్రీ కృష్ణ సాయి కాలనీలోని సూర్య తేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్ర, శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు హాస్పిటల్ ఎండీ బంగారు సూర్యప్రకాశరావు, (సీనియర్ ఫ్యామిలీ ఫిజీషియన్) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో నివసిస్తున్న పేద ప్రజలకు అందు బాటులో ఉండేందుకు రెండేండ్లుగా కోవిడ్ కార ణంగా పనులు లేక పోవడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా టెస్ట్లు చేయించుకునే స్తోమత లేక అనేక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం ప్రజలకు డయాబెటిక్, పోషక లోపాల వల్ల కంటి ప్రాబ్లమ్స్, అనేక కారణాల వల్ల ఒడిదుడుకులకు లోనై, పరీక్ష లు చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పేద ప్రజల కోసం ఎలాంటి ఫీజు లేకుండా, ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, షుగర్ పరీక్ష, బ్లడ్ గ్రూప్ పరీక్ష, ఇసీజీ, కంటి పరీక్ష, తదితర పరీక్షలను ఉచితంగా చేయడం ద్వారా సుమారు శుక్రవారం 150 మంది, శనివారం 250 మంది వరకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చలికాలంలో ముఖ్యంగా పిల్లలు, పెద్దలు సైతం, వైరల్ జ్వరాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జ్వరం, జలుబు, దగ్గు, లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనీ, వాతావరణంలో ఉష్ణోగ్రతలు మారటం వల్ల ఇలాంటి వ్యాధులు ఎక్కువ వచ్చే సూచనలు ఉన్నాయనీ, ఇలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఈ వచ్చే చలి కాలంలో ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్య తేజ్ హాస్పిటల్ డాక్టర్స్, సిస్టర్స్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.