Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా మండలంలోని కుషాయిగూడలో ఉన్న అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో ఆఫ్లైన్ క్లాసులనుతోపాటు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహించాలని విద్యార్థుల తల్లి దండ్రులు దాదాపు 100 మందికి పైగా శనివారం ఆందోళనకు దిగారు. స్కూల్ ఫీజులను మొత్తం చెల్లించి నప్పటికీ చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఆన్లైన్ లింకు పంపించడం లేదనీ, ఇప్పటికే పలుమార్లు యాజ మాన్యానికి వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపో వడంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు మద్దతుగా తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ, తెలంగాణ కళాశాల అధ్యాపక సంఘం రాష్ట్ర నాయకులు సంతోష్, ఎస్ఎఫ్ఐ ఉప్పల్ నియోజకవర్గ అధ్యక్షులు ఖాసిం జాలం, సాయి మద్దతుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ వారికి ఇష్టం వచ్చిన విధంగా విద్యార్థులను పాఠశాలలకు పంపించాలని చెప్పినట్టు తెలిపారు. అక్షర ఇంటర్నేషనల్ పాఠశాల ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఆఫ్ లైన్లోనే పిల్లలను పంపించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇలా పిల్లలను పాఠశాలకు పింపిస్తే ట్రాన్స్పోర్టు, స్కూల్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, ఇతరత్రా ఫీజులను మరింతగా వసూలు చేసుకునే వెసులుబాటు ఉందదనీ, యాజమాన్యం ఇలాంటి ఘట నలకు పాల్పడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంఘాల నాయకులు ఆందోళనకు ప్రిన్సిపాల్ దిగివచ్చి సోమవారం నుంచి ఆన్లైన్ క్లాసుల లింక్ పంపిస్తామని హామీనిచ్చారు. ఈ హామీని ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లి దండ్రులు సింధు, తిరుమలి, సచిన్, నరేష్ పాల్గొన్నారు.