Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భక్తి టీవీ నిర్వహణలో ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం అశేష జనవాహిని మధ్య విశేషం పూజలతో జరుగుతుంది. వేద పండితులు సింహాద్రి అప్పన్న స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను కల్పవక్ష వాహనంపై ఊరేగించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హాజరై పూజలు నిర్వహించారు. ఛానల్ అధినేత నరేంద్ర చౌదరి నిర్వహణలో సింహాద్రి అప్పన్న కల్యాణ వేడుక వేద పండితులు నిర్వహించారు. సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం ఆకట్టుకొంది. సురభి శారద బందం ఫుజిన్ నత్యం, వెంకట్ గవై నాట్య ము, కోలాటం కన్నుల విందు చేసాయి. ఇ. టి. కమీషనర్ వసుంధర సిన్హా పాల్గొన్నారు శ్రీ శ్రీ దేవానంద రామానుజ జీయర్ స్వామి,శ్రీ శివ స్వామి, శ్రీ సర్వ విద్యానంద సరస్వతి, అనుగ్రహ భాషణం నిర్వహించారు. శ్రీశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ విశేష ప్రవచనంతో భక్తులలో భక్తిభావాన్ని వెల్లువెత్తినచారు. వేద పండితులు భక్తులచే శివ లింగాలకు అష్టోత్తర శతనామార్చన చేయించారు. -నవతెలంగాణ, అడిక్మెట్/కల్చరల్