Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
బాలల రక్షణ హక్కులకు సంబధించిన చట్టాల సక్రమంగా అమలుకు తగు చర్యలు తీసుకొంటామని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రవీంద్రభారతి వేదికపై ఆదివారం రాష్ట్ర మహిళ శిశుసంక్షేమ శాఖ నిర్వహణలో బాలల దినోత్సవం పిల్లల నత్యాలు, పాటల కోలహం మధ్య కన్నులపండుగగా జరిగాయి. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు పుస్తకాలు చదువులకే పరిమితం కాకుండా వారికి విజ్ఞాన, వినోద పర్యటనలు, క్రీడలు, కళా ప్రక్రియల్లో పాల్గొనేలా ప్రోత్సహించే కార్యక్రమాలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వారం రోజుల పాటు వచ్చే ఏడాది నుంచి అమలుచేస్తామని ప్రకటించారు. ఈఏడాది 33 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను నగరంలోని ఫిల్మ్ సిటీ, జూ పార్క్ చూసే అవకాశం కల్పించామని తెలిపారు. అనాథ బలబాలికలకు ప్రభుత్వమే తండ్రి పాత్ర పోషించి వారిలో ఆత్మ విశ్వాసం కల్గించి విద్య, వైద్య సేవలు అందించే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన సుమారు 15 వేల మందిపై ఉన్నారని వారిని చదివించి పెళ్లి చేసేవరకు ప్రభుత్వ బాధ్యత తీసుకొనే సమగ్ర విధానం త్వరలో అమల్లోకి తెస్తామని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పిల్లల హక్కుల పై చట్టాలు ఉన్న సక్రమంగా అమలు కావటం లేదన్నారు. బాలల హక్కుల కమిషన్ చైర్మెన్ జె.శ్రీనివాసరావు, సభ్యులు అపర్ణ, నాగజ్యోతి తదితరులు పాల్గొన్న సభకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ స్వాగతం పలికారు.