Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
సామాజిక, రాజకీయంగా విద్య ఉద్యోగ ఉపాధి రంగాలతోపాటు ఆర్థిక రంగంలో కూడా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. దేశీఉద్యమకారులకు సామాజిక ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాలపై బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లోరౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ కులాల గణన చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో ఈ కుట్రకు గల కారణాలు కేంద్ర ప్రభుత్వం వివరించాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు హీరో సుమన్ మాట్లాడుతూ ఉద్యమంలో నిజాయితీ బీసీలందరూ ఒక్కతాటిపై ఐక్యంగా పోరాడి పోరాటంలో తాను భాగస్వామినౌతన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణ చేపట్టకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. సమావేశంలో రాజారామ్ యాదవ్, డాక్టర్ వినరు కుమార్, ఓబీసీ మోర్చా నాయకులు చౌదరి వికాస్ పటేల్, అంబేద్కర్ పూలే యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.