Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
మగ్దూంనగర్లో నాయకులను, యువతను కలుపుకోనిపోయి సీపీఐ పార్టీని బలోపేతం పరిచేందుకు కృషి చేయాలని కుత్బుల్లాపూర్ మండల సీపీఐ కార్యదర్శి ఈ.ఉమామహేష్ నూతన కమిటీ సభ్యులకు తెలిపారు. ఆదివారం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మగ్దూంనగర్ సీపీఐ కార్యాలయంలో శాఖ మాజీ కార్యదర్శి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు పోరాటాల వల్లే మగ్దూంనగర్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా మగ్దూంనగర్ శాఖ కార్యదర్శిగా సుధాకర్, సహాయ కార్యదర్శిగా ఖయ్యూమ్, వీరస్వామిలతో పాటు 8 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ , ఏఐటీయూసీ అధ్యక్షులు హరినాథ్, ఏఐవైఎఫ్ కన్వీనర్ వెంకటేష్, సీపీఐ నాయకులు రాములు, శాఖ సభ్యులు రంజీత్, ఖదీర్, ఉప్పలయ్య, వెంకటేష్, అభిలాష్, బాబర్ తదితరులు పాల్గొన్నారు.