Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిసెంబర్ 5న 'హలో మాల ఛలో ఢిల్లీ'
మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య
నవతెలంగాణ-హిమాయత్నగర్
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రవేశపెట్టే బిల్లును అడ్డుకుంటామని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య హెచ్చరించారు.ఆదివారం బషీర్బాగ్ లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే 'హలో మాల ఛలో ఢిల్లీ' ర్యాలీ, ధర్నా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే కేంద్ర మంత్రులను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో మాలలు తగిన బుద్ధి చెప్తారని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డిసెంబర్ 5న ఢిల్లీలో చేపట్టబోయే ర్యాలీ, నిరసన కార్యక్రమాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో మాలలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బంగీ ఆనందరావు, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు కావలి రమేష్, నాయకులు సురేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు