Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎన్పీఏ పథకం న్యాయ శాఖ ఉద్యోగులకు మరణ శాసనంగా మారిందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో న్యాయ శాఖ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ శాఖ ఉద్యోగుల సమస్యలపై వారి బెనిఫిట్స్పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని తీర్మానించామన్నారు. వివిధ కారణాలతో ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని తెలిపారు. రెండు నెలల్లో కోర్టు ఉద్యోగుల సంక్షేమం బెనిఫిట్స్ పై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే న్యాయ శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని హెచ్చరించారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పింఛన్ స్కీమ్ అమలయ్యేలా చూడాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులతో సమానంగా రాజ్యాంగం కల్పించిన అన్ని వసతులను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. న్యాయ శాఖలో విభజించి పాలించు అనే సిద్ధాంతం నడుస్తోందని ఆరోపించారు. జడ్జిలకు ఉన్నట్లుగానే ఉద్యోగులకు కూడా కామన్ రూల్స్ వర్తింపజేయాలన్నారు. కోర్టుల సంఖ్య పెంచి ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రిక్రూట్మెంట్ చేయకుండా ఇతర కోర్టులో స్టాఫ్ ను అడ్జెస్ట్ చేస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ముందు స్టాఫ్ రిక్రూట్ చేసి ఆ తరువాత కొత్త కోర్టులు ప్రారంభిం చాలని సూచించారు. లీగల్ సర్వీస్ అథారిటీల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్నారు. న్యాయ వ్యవస్థలో పోస్టులు క్రియేట్ చేయడానికి ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా హైకోర్టు జడ్జీలకు అధికారాలు ఇవ్వాలని వెల్లడించారు.