Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఎంతో మంది బాల,బాలికలు బుద్ధిమాంద్యంతో పీడింప బడుతున్నారని, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని మాధవ్ ఆటిజం ఫౌండేషన్ అధ్యక్షురాలు సుమన్ సరఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పవర్ గ్రిడ్ ఆడిటోరియంలో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడు తూ కేవలం హైదరాబాద్ నగరంలోనే లక్షకు పైగా బాల, బాలికలు బుద్ధిమాంద్యంతో పీడింపబడుతున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏడాది నిండిన తరువాత తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని సూచించారు. పిల్లలు ఒక చోట స్థిరంగా కూర్చోకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుండటం, చూపు స్థిరంగా ఉండక పోవడం, మనుషులను గుర్తుపట్టకుండా ఉండడం, తల్లిదండ్రులతో సన్నిహితంగా ఉండకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే ఆ పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడుతు న్నట్లు గుర్తించాలని సూచించారు. అలాంటి పిల్లలకు యాపిల్స్, అరటిపండు, తీపి పదార్థాలు, పులుపు, మైదా, గోధుమ ఆహారాన్ని పూర్తిగా ఇవ్వకూడదన్నారు .ఆకుకూర లతో కూడిన ఆహారాన్ని అందించటం శ్రేయస్కరమన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సుమన్ సరఫ్, మాధవ్ ఆటిజం సెంటర్లలో విదేశీ వైద్యాన్ని కేవలం బుద్ధిమాం ద్యంతో బాధపడే పిల్లల కోసం చికిత్సను అందిస్తున్నామని స్పష్టం చేశారు. బుద్ధిమాంద్యంతో పీడింపబడుతున్న పిల్లలు, పెద్దల సమాచారం తెలిసిన వారు 96407666 83 ఫోన్ నెంబర్కు సమాచారాన్ని అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈడీ గోలి అనూప్ కుమార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎల్.సందీప్, పీడీయాట్రిక్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ లోకేష్ లింగప్ప, మహేష్ కార్పొరేట్ అర్బన్ బ్యాంక్ ఏపీ చైర్మెన్ బి.రమేష్, తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షుడు ఎ.కె.అగర్వాల్, అనిల్ సరఫ్, డాక్టర్ దిలీప్ కుమార్ భన్సాలీ తదితరులు పాల్గొన్నారు.